బాహుబలితో మరింత క్రేజ్ సంపాధించుకున్న సినీయర్ నటి రమ్యకృష్ణకు అదిరిపోయే ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. హీరో నితిన్ ‘అంధాధున్’ తెలుగు రీమేక్లో ఆమె బోల్డ్ క్యారెక్టర్ చేస్తోందట. అందుకు గాను భారీ పారితోషికం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. రమ్యకృష్ణ అడిగినంత ఇచ్చేందుకు నిర్మాతలు కూడా రెడీగా ఉన్నారట. ప్రస్తుతం భర్త కృష్ణవంశీ దర్శకత్వంలో ‘రంగమార్తాండ’ సినిమాలో నటిస్తోంది రమ్యకృష్ణ.
ఈ సినిమా చేస్తుండగానే ‘ అంధాదున్’ తెలుగు రీమేక్లో ఆమెకు ఆఫర్ దక్కిందని తెలుస్తోంది. హిందీలో వచ్చిన అంధాదున్ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించగా, ఆయనకు సరితూగే పాత్రలో టబు నటించింది. బోల్డ్ అండ్ నెగెటివ్ రోల్ పోషించిన టబు ఈ మూవీ విజయంలో కీలక భూమిక పోషించింది. దాంతో తెలుగు రీమేక్ లో టబ్ పాత్రను రమ్యకృష్ణతో చేయించాలని అనుకున్నారు. అయితే ఆ పాత్రలో అనసూయతో కూడా చేయించాలనుకున్నారు.
కానీ ఫైనల్ గా రమ్యకృష్ణ చేత చేయించాలని డిసైడ్ అయ్యారట. ఈమెరకు రమ్యకృష్ణను సంప్రదించి ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారని తెలుస్తోంది. అయితే రమ్యకృష్ణ కూడా ఈ బోల్డ్ క్యారెక్టర్ చేసేందుకు భారీగానే డిమాండ్ చేసిందని, బేరసారాల అనంతరం చివరకు ఆమెనే ఫైనల్ చేశారనేది లేటెస్ట్ టాక్. అందుతున్న సమాచారం మేరకు దాదాపు మూడు కోట్లు తీసుకుందట. మేర్లపాక గాంధీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.