Friday, March 29, 2024
- Advertisement -

కఠిన సమయంలోను ఆ పనిని విజయవంతంగా పూర్తి చేసిన తమన్నా!

- Advertisement -

టాలీవుడ్ ఇండస్ట్రీలో మిల్క్ బ్యూటీ గా ఎంతో పేరు సంపాదించుకున్న తమన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తమన్నా యంగ్ హీరో నితిన్ సరసన “మాస్ట్రో” చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. బాలీవుడ్లో ఎంతో విజయవంతమైన ‘అంధాదూన్‌’కి రీమేక్‌గా రూపొందుతోంది.

బాలీవుడ్ చిత్రంలో టబు చేసిన పాత్రనే తెలుగులో తమన్నా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి తమన్నా మాస్ట్రో తో తన ప్రయాణం పూర్తయిందని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తిచేసుకున్న సందర్భంగా తమన్నా ఇన్‌స్టా వేదికగా స్పందించారు.

Also read:హైపర్ ఆదికి కించపరచడం, రెచ్చిపోవడం అలవాటు!

మాస్ట్రోతో తన ప్రయాణం ముగిసిందని ఇక సినిమాను తెరపై చూడటమే మిగిలింది. త్వరలోనే ఈ చిత్రం విడుదల తేదీని అధికారకంగా ప్రకటిస్తారని ఈ సందర్భంగా తమన్నా తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఈ కఠిన సమయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ సినిమా షూటింగ్లో పాల్గొని ఎంతో దిగ్విజయంగా పూర్తి చేశామని తెలిపారు. తమన్నా ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ సరసన ఎఫ్ 3, గోపీచంద్ సిటీ మార్, సత్యదేవ్‌కు జోడీగా ‘గుర్తుందా శీతాకాలం’ వంటి చిత్రాలలో నటిస్తున్నారు.

Also read:పార్టీలో డ్రగ్స్… నటి అరెస్ట్.. ఎవరంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -