బుల్లితెరను హాట్ హాట్ అందాలతో హీట్ ఎక్కించింది యాంకర్ రష్మీ. జబర్దస్త్ షోతో బాగా ఫాపులర్ అయ్యింది ఈ భామ. బుల్లితెర మీదనే కాకుండా వెండితెరపై గుంటూరు టాకీస్ చిత్రంతో వెండితెరను కూడా తన హాట్ అందాలతో హీటెక్కించింది. మొత్తానికి రష్మీ బుల్లితెరపై.. వెండితెర పై సూపర్బ్ క్రేజ్ సంపాధించుకుంది.
రీసెంట్ గా రష్మీ స్టార్ హీరోలకే అందకుండా తిరుగులేని రికార్డుతో దూసుకెళుతోన్న స్టైలీష్స్టార్ అల్లు అర్జున్ రికార్డుకే చెక్ పెట్టింది. యూట్యూబ్ లెక్కలోకి వెళ్లితే ఇప్పటి దాకా మన టాలీవుడ్లో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న పాటగా అల్లు అర్జున్, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన రేసు గుర్రం సినిమాలోని సినిమా చూపిస్తా మామా అన్న సాంగ్ ఉంది.
ఈ పాట ను ఇప్పటి వరకు 1 కోటి 96 లక్షల వ్యూస్తో యూ ట్యూబ్లో రికార్డ్ సృష్టించింది. దాంతో బన్నీ ఖాతాలో ఒక అరుదైన రికార్డ్ ఇంత కాలం భద్రంగా ఉంది. తాజాగా రష్మీ గుంటూరు టాకీస్ సినిమాలోని మాస్ మసాలా సాంగ్ ‘నీ సొంతం’ అనే పాట మాస్ జనాన్ని ఒక ఊపు ఊపేసింది. ఈ సాంగ్ యూట్యూబ్లో ఇప్పటికే 2 కోట్ల 3 లక్షల వ్యూస్ని సాధించేసి అల్లు అర్జున్ రికార్డుకు చెక్ పెట్టింది. ఏదేమైనా స్టార్ హీరోలే క్రాస్ చేయని రికార్డును రష్మీ తన హాట్ అందాలతో క్రాస్ చేయడం అంటే మాటలు కాదుగా..!
Related