Saturday, May 18, 2024
- Advertisement -

రేణు దేశాయ్ చనిపోయిందని అనుకొని ఆమె పాప అలా చేసిందట

- Advertisement -

రేణు దేశాయ్.. పవన్ ని పెళ్లి చేసుకున్న తర్వాత వారు.. కొన్నాళ్లు బానే కలిసి ఉన్నారు. ఆ తర్వాత కొన్ని కారణాల చేత రేణు దేశాయ్ తో పవన్ కళ్యాణ్ విడిపోయారు. అప్పటికే రేణుకి ఇద్దరు పిల్లలు అన్న విషయం తెలిసిందే. అయితే రేణు కొంత కాలంగా వెండితెరకు దూరంగా ఉన్న.. మళ్లీ ఆ తర్వాత నీతోనే డాన్స్ ప్రోగ్రాం తో జడ్జ్ మారి బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది.

ఈ షో ద్వారా రేణు తన నిజ జీవితంలోని సంఘటనలని అభిమానులతో షేర్ చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. గతంలో ఓ సారి తనకు తీవ్ర అస్వస్థత కలిగినప్పుడు నిద్ర మాత్రలు వేసుకోవాల్సి వచ్చేదని.. దానితో ఒకేసారి నిద్రలోకి జారుకున్నానని.. అప్పుడు తన కూతురు ఆద్యా లేపడానికి వచ్చిందని.. కానీ నిద్ర మాత్రల వల్ల నిద్రలోనే ఉన్న నేను లేవలేదని.. అప్పుడు ఆద్యా భయపడి ఏడ్చిందని, లేచి అడిగితే చనిపోయాను అనుకుని భయపడిందని చెప్పింది.

తాను దగ్గరికి తీసుకుని నేను చనిపోతే నీకు పెళ్లి ఎవరు చేస్తారు, నీ పిల్లల్ని ఎవరు ఆడిస్తారు అని సముదాయించాక కుదుట పడిందని చెప్పుకొచ్చింది. నీతోనే డాన్స్ షో లో రేణు కొత్త లుక్స్ తో కనిపిస్తూ, ఎవరికి తెలియని సంగతులు షేర్ చేసుకుంటూ పాత రోజులని గుర్తుకు తెస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -