- Advertisement -
సాయి ధరమ్తేజ్ రెజీనా కాసాండ్ర జంటగా కలిసి నటించిన చిత్రాలు పిల్లా నువ్వు లేని జీవితం, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’. ఈ రెండు చిత్రాలు విజయం సాధించడంతో వీరిద్దరిది హిట్ పెయిర్ అనే ముద్ర పడిపోయింది. దీనితో పాటు వీరిద్దరి మధ్య ఏదో ఉందనే రూమర్లు కూడా హల్చల్ చేశాయి.
ఇప్పుడు తాజాగా దాన్ని బలోపేతం చేసేలా సాయి ధరమ్ నాకు రెజీనా కావాలి అంటున్నాడట. అసలు విషయంలోకి వస్తే సాయిధరమ్ తేజ్-గోపిచంద్ మలినేని కాంబినేషన్లో ఒక చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లకి అవకాశం ఉందట. వెంటనే సాయి ధరమ్ రెజీనా అయితే బాగుంటుందని చెప్పేశాడట. మరో హీరోయిన్ని లావణ్య త్రిపాఠిని తీసుకునే ఆలోచనల్లో ఉన్నారట. దీనితో దర్శక-నిర్మాతలు ఆ ఇద్దరి హీరోయిన్లు డేట్స్ తీసుకునే పనిలో పడ్డారని సమాచారం.