మిల్కి బ్యూటీ తమన్నా కు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. బాహుబలి చిత్రం తర్వాత తమన్నా రేంజ్ మరింత పెరిగిపోయింది. తెలుగు, తమిళంలో తమన్నా టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అయితే ఓ యంగ్ దర్శకుడు తమన్నాపై చాలా ఇంట్రస్ట్ చూపిస్తున్నాడన్న వార్తలు ఇండస్ర్టీలో జోరుగా వినిపిస్తున్నాయి.
ఇంతకు ఆ దర్శకుడు ఎవరో కాదు సంపత్నంది. సంపత్ నంది దర్శకత్వంలో వచ్చిన రచ్చ, బెంగాల్ టైగర్ చిత్రాల్లో తమన్నా హీరోయిన్గా నటించింది. దీంతో తమన్నా సంపత్నంది తన సెంటిమెంట్గా భావిస్తున్నాడట. దీంతో తన కొత్త సినిమాలో కూడా ఆమెను తీసుకోవాలని డిసైడ్ అయ్యాడట. ప్రస్తుతం సంపత్నంది హీరో గోపిచంద్తో ఓ సినిమా చేయబోతున్నాడు.
అయితే ఈ చిత్రంలో హన్సిక, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కనీసం ఐటం సాంగ్తో అయినా తన సినిమాలో తమన్నాకు చోటు కల్పించాలని సంపత్నంది డిసైడ్ అయ్యాడట. అయితే తమన్నా భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చి అయిన ఈ చిత్రంలో తమన్నాకు చాన్స్ ఇవ్వాలని చూస్తున్నాడట.
Related