Sunday, April 28, 2024
- Advertisement -

‘శ్రీకారం’ నిర్మాతలకు హీరో శర్వానంద్ లీగల్ నోటీసులు?

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా ఉండే టాలీవుడ్ హీరోల్లో శ‌ర్వానంద్ ముందు వ‌రుస‌లో ఉంటారు. కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి తన పని తాను చేసుకుంటూ వెళ్తున్న శర్వానంద్ ఇప్పుడు సెన్సేషనల్ టాపిక్ గా మారారు. వివరాల్లోకి వెళితే.. ఈ మద్య శర్వానంద్ నటించిన చిత్రం ‘శ్రీకారం’.మహా శివరాత్రి కానుకగా మార్చ్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన స్థాయిలో విజ‌యాన్ని ద‌క్కించుకోలేదు.

సినిమాను నిర్మించిన 14 రీల్స్ ప్ల‌స్ నిర్మాత‌ల‌కు న‌ష్టం జ‌రిగింది. ఈ సినిమాతో తాము బాగా నష్టపోయినట్లు నిర్మాతలు అంటున్నారట. అయితే సినిమా విడుదల త‌ర్వాత ఇస్తామ‌ని శ‌ర్వానంద్‌ ఇవ్వాల్సిన రెమ్యున‌రేష‌న్ పెండింగ్‌లో పెట్టార‌ని తెలిసింది. సినిమా విడుద‌లై చాలా రోజులైన‌ప్ప‌టికీ నిర్మాత‌ల నుంచి తన రెమ్యున‌రేష‌న్ పై స్పంద‌న లేక‌పోవ‌డంతో శర్వానంద్ వారికి లీగల్ నోటీసులు ఇవ్వబోతున్నట్లు ఫిలిమ్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇదిలా ఉంటే ఈ వివాదంపై ఇటు శర్వానంద్ కానీ, అటు నిర్మాతలు కానీ స్పందించలేదు. ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే వారు స్పందించాల్సిందే. ఈ వివాదాన్ని “శ్రీకారం” నిర్మాతలు, శర్వాతో మాట్లాడి సామరస్యంగా పరిష్కరించుకుంటారా ? లేదంటే లీగల్ గానే ముందుకు వెళ్తారా అనేది చూడాలి.

ఎన్టీఆర్‌కు భార‌త‌రత్న ఇస్తే తెలుగు జాతికి గౌరవం : చిరంజీవి

దేశ రాజధానిలో దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేత!

Watch: రాష్ట్రంలో 16 చోట్ల హెల్త్‌ హబ్స్‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -