యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం హీరోయిన్ వేటలో పడ్డాడు. త్రివిక్రమ్ డైరక్షన్లో ఎన్టీఆర్ ఓ సినిమా కమిటైన సంగతి తెలిసిందే.త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయడం కోసం ఎన్టీఆర్ చాలా రోజులుగా వెయింటింగ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ సినిమా అజ్ఞాతవాసి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైంది.దీంతో త్రివిక్రమ్ పై అందరికి అనుమానం ఏర్పిడింది.దీంతో ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ మరింత మెరుగ్గా తయారు చేయడంపై దృష్టి పెట్టాడు. నటుల ఏంపికలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నాడని టాక్.
మొదట ఈ సినిమా లో హీరోయిన్గా అను ఇమ్మానుయేల్ ను తీసుకున్నారు,కాని ఏం జరిగిందో తెలియదు మొత్తనికి హీరోయిన్ మార్చేశారు అనే వార్త హల్ చల్ చేస్తుంది.ఇప్పుడు ఆ ప్లేస్ లో బాలీవుడ్ భామ శ్రద్ధకపూర్ ను తీసుకోవడం గురించి ఆలోచిస్తున్నారనేది టాలీవుడ్ లో లేటెస్ట్ గా వినిపిస్తున్న మాట. ఎన్టీఆర్ – శ్రద్ధకపూర్ జంట తెలుగు ప్రేక్షకులకు కొత్త లుక్ ఇస్తుందని ఆలోచనలో మిగతా యూనిట్ కూడా ఉందని తెలుస్తోంది. శ్రధ్ధ కపూర్ ప్రస్తుతం ప్రభాస్ తో సాహోలో నటిస్తోంది. ఈ భామకు ఆ క్రేజ్ ఉండటం సినిమాకు ప్లస్సవుతుందని త్రివిక్రమ్ ఆలోచన.