కమల్ పార్టీలోకి హీరో విశాల్
తమిళ రాజకీయలలో చాలా మార్పులు వస్తున్నాయి.జయలలిత మరణంతో రాజకీయ సంక్షోబం ఏర్పడింది. అటు కమల్ ఈటు రజిని రాజకీయ అరంగ్రేటారికి రెడీ అయ్యారు,,కమల్ హాసన్ పార్టీ పేరు ప్రకటన కూడా చేశారు. ఇప్పుడు కమల్ కూమార్తే అయ్యిన శృతి హాసన్ తన తండ్రి రాజకీయ పార్టీపై కామెంట్ చేసింది. తన తండ్రి ప్రజా సేవ వైపు నడవడం, మహాత్మాగాంధీని ఆదర్శంగా తీసుకుంటానని, అవినీతి రహిత సమాజం కోసం పాటుపడతానని ప్రకటించడంతో శృతి హాసన్కు తండ్రిపై అపారమైన గౌరవం పెరిగింది. దీంతో కమల్కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపిందట శృతి హాసన్. అంతటితో ఆగలేదు రాజకీయంగానే కాదు.
మీరు వేసే ప్రతి అడుగులో సలహాలను నేను ఇస్తూ, మీ వెంట నేనుంటా నాన్నా అంటూ మాట ఇచ్చిందట. శృతిహాసన్ మాత్రం తనకు తెలిసిన సినీప్రముఖులను కమల్ హాసన్ పార్టీలో చేర్పించే ప్రయత్నం చేస్తోందట. అందులో మొదటి వ్యక్తి విశాల్. ఇప్పటికే వీరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉందని తమిళ సినీపరిశ్రమలో ప్రచారం జరిగింది. విశాల్ కనుక కమల్ పార్టీలో చేరితే అది కమల్ పార్టీకి పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది.ఇలా శృతిహాసన్ తనకు పరిచియమున్న హీరోలను తన తండ్రీ పార్టీలోకి తీసుకురావలని ప్లాన్ చేస్తుంది.