సౌత్ ఇండియన్లో ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది అందాల తార నయనతార. కోలీవుడ్ యంగ్ హీరో శింబు, నయనతార సీక్రెట్గా పెళ్లి చేసుకున్నారు. అవును ఇది నిజం.. ప్రభుదేవాతో ప్రేమ వ్యవహారానికి ముండు తమిళ స్టార్ హీరో శింబుతో నయనతార ప్రేమ వ్యవహారం నడిపిన విషయం తెలిసిందే.
వారి ప్రేమ పెళ్లి వరకు వెళ్లి తర్వాత ఏవో కారణాల వల్ల విడిపోయింది. అయితే.. తాజాగా వీరిద్దరు ఒక్కటయ్యారు. మ్యారేజ్ చేసుకున్నారు. గుళ్లో మూడు ముళ్ల బంధంతో దగ్గరయ్యారు. అయితే వీరిద్దరు పెళ్లి చేసుకుంది మాత్రం నిజ జీవితంలో కాదు… గతంలో ఈ జంట కలిసి వల్లభ సినిమా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు దాదాపు పదేళ్ల తర్వాత వారిద్దరు కలిసి సరసుడు సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార ఓ హీరోయిన్ కాగా.. ఆండ్రియా, ఆదాశర్మ మరో ఇద్దరు హీరోయిన్లు.
ఈ చిత్రంకు హిట్ సినిమాల డైరెక్టర్ పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. శింబు సినీ ఆర్ట్స్ పతాకంపై శింబు తండ్రి టి.రాజేందర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. గతేడాదే తమిళంలో ‘ఇదు నమ్మ ఆళ్’గా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో త్వరలోనే రిలీజ్ కానుంది. ఐటీ బ్యాక్డ్రాప్లో నడిచే ప్రేమ కథగా ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం తెలుగు నేటివిటికి అనుగుణంగా మార్పులు చేస్తున్నారు. వాలెంటైన్స్ డే కానుకగా ఆడియోను..ఈ నెలలోనే సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకు శింబు తమ్ముడు కురళ అరసన్ మ్యూజిక్ దర్శకుడు.
Related