నంద్యాల ఉప ఎన్నిక తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకున్నాయనె వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. మరిన్ని పార్టీ ఫిరాయింపులు జోరందుకుంటున్నాయనె వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిలో భాగంగా వైసీపీకి భారీ షాక్ తగులు తుందనె సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జగన్కు అత్యంత సన్నిహితుడైన ఎమ్మెల్యే నేతృత్వంలో పది మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్ లో రహస్యంగా సమావేశమయ్యారనే వార్త ఇప్పుడు హల్ చల్ అవుతోంది. దీనిపై పార్టీలో ఉత్కంఠ నెలకొంది. సోషియల్ మీడియాలో వస్తున్న వార్తను బట్టి వీళ్లే పార్టీని మారబోతున్నారనె సమాచారం.
1.రాయచోటి – శ్రీకాంత్ రెడ్డి
2. పాలకొండ – కళావతి
3. మంత్రాలయం – బాలా నాగిరెడ్డి
4. తిరువూరు – రక్షణ నిధి
5. నూజివీడు – మేకా ప్రతాప్ అప్పారావు
6. బాపట్ల – కోన రఘుపతి
7. గుంటూరు ఈస్ట్ – ముస్తఫా
8. మార్కాపురం – జంకే వెంకట్ రెడ్డి
9. పీలేరు – రామచంద్రారెడ్డి
10. మైదుకూరు – జయరామి రెడ్డి
11. కడప – అంజద్ బాషా
ఈ ఎమ్మెల్యేలందరికీ శ్రీకాంత్ రెడ్డి నేతృత్వం వహిస్తున్నారనే సమాచారం అటు వైసీపీ వర్గాలను కూడా తీవ్ర ఆశ్చర్యానికి, ఆందోళనకు గురిచేస్తోందని తెలుస్తోంది. జగన్ కు అత్యంత సన్నిహితులుగా పేరొందిన శ్రీకాంత్ రెడ్డి, అంజాద్ భాష లాంటి వాళ్లు కూడా పార్టీ మారబోతున్నారనే సమాచారం లోటస్ పాండ్ లో కలకలం సృష్టిస్తోంది. సోషియల్ మీడియాలో వైరల్ అవుతున్న దీనిపై శ్రీకాంత్రెడ్డి స్పందిస్తె గాని ఉత్కంఠకు తెరపడుతుంది.