Tuesday, May 7, 2024
- Advertisement -

శ్రీను వైట్ల పరిస్థితి అసలు బాగాలేదు!

- Advertisement -

ప్రస్తుతం దర్శకుడు శ్రీను వైట్ల పరిస్థితి అసలు బాగాలేదు. దూకుడు చిత్రంతో టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శ్రీను వైట్ల.. ఈ చిత్రం తర్వాత చేసిన ఆగడు, బ్రూస్లీ సినిమాలు పరాజయం పోందాయి. దాంతో శ్రీను వైట్ల కెరీర్ పరంగా ఇబ్బందిలో పడ్డాడు. ఇప్పుడు మెగా హీరో వరుణ్‌తేజ్‌తో ‘మిస్టర్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఈ చిత్రంతో పూర్వ వైభవం తెచ్చుకోవాలని శ్రీను వైట్ల శ్రమిస్తున్నారు. కెరీర్ పరంగానే కాకుండా అతను ఇంట్లోనూ సమస్యలను ఎదుర్కుంటున్నారు. కొంతకాలం క్రితం భార్యతో కలహాల వల్ల రోడ్డు ఎక్కారు. పోలీసుల చొరవతో గొడవలు సద్దుమణిగినా ఈ డైరక్టర్ కి ప్రశాంతత కరువైంది.

వీటన్నింటికీ ఇంటి వాస్తు బాగాలేకపోవడమే కారణమని పండితుడు చెప్పడంతో శ్రీను వైట్ల ఎంతో ఇష్టపడి కొనుక్కున్న హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలోని ఇంటిని అమ్మేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకే తన ఇంటిని రూ.15 కోట్లకు విక్రయించేందుకు సిద్ధమయ్యాడు. అయితే మార్కెట్ రేటుకి తక్కువకు భేరం పెట్టినా ఎవరూ ఇంటిని కొనడానికి ముందుకు రావడం లేదట. ఈ విషయం తెలుసుకున్న వారు పాపం శ్రీను వైట్ల అంటున్నారు.

Related

  1. డైరెక్టర్ చేతిలో అఖిల్ కి ఘోర అవ‌మానం!
  2. హీరోయిన్ ని ఘోరంగా తిట్టిన నిర్మాత
  3. సంపూకి ఘోర అవమానం..!
  4. వరుణ్ తేజ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘మిస్టర్’ ప్రారంభం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -