Saturday, May 4, 2024
- Advertisement -

చిరుకి ఆ మూవీపై నమ్మకం లేదా.. అందుకే వెనక్కి ?

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య మూవీతో ఫుల్ బిజీగా ఉన్నాడు. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్లు చిత్రాయునిట్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ కంటే ముందే సెట్స్ పైకి వెళ్ళిన ” బోళా శంకర్ ” ప్రాజెక్ట్ కు సంబంధించి ఇంతవరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. మూవీ ప్రారంభంలో కొన్ని పోస్టర్స్ రిలీజ్ చేసిన చిత్రబృందం.. ఆ తరువాత మూవీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.

గాడ్ ఫాధర్ మూవీతో పాటు బోళా శంకర్ మూవీని కూడా ఒకేసారి సెట్స్ పైకి తీసుకెళ్లారు మెగాస్టార్. అయితే గాడ్ ఫాదర్ ఇప్పటికే రిలీజ్ అయింది. దాంతో గాడ్ ఫాదర్ తరువాత బోళా శంకర్ మూవీనే అని భావించారంతా. అయితే ఎవరు ఊహించని విధంగా బాబీ దర్శకత్వంలో ” వాల్తేరు వీరయ్య ” సెట్స్ పైకి తీసుకెళ్లడంతో పాటు చక చక షూటింగ్ కూడా కంప్లీట్ చేస్తూ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు చిరు. దీంతో బోళా శంకర్ మూవీ ఆగిపోయిందనే వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి.

ఈ మూవీకి మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే మెహర్ రమేశ్ దర్శకత్వంలో వచ్చిన శక్తి, షాడో వంటి చిత్ర తెలుగు ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్స్ గా మిగిలిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. అయినప్పటికి చిరు ” బోళా శంకర్ ” తో అవకాశం ఇచ్చాడు. ఈ చిత్రం అజిత్ నటించిన ” వేదాలం ” కు రీమేక్ గా తెరకెక్కుతోంది. కాగా ” బోళా శంకర్ ” అవుట్ పుట్ పై చిరు కాస్త అసంతృప్తిగా ఉన్నడని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే ముందు ” వాల్తేరు వీరయ్య ” రిలీజ్ కు సిద్దం చేశారని ఫిల్మ్ నగర్ ఇన్ సైడ్ టాక్. మరి ” బోళా శంకర్ ” ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మహేష్ తో పోటీ.. ఆ పాన్ ఇండియా మూవీ నిలబడగలదా ?

బాలీవుడ్ లో ప్రభాస్ తరువాతే.. షారుక్, హృతిక్ !

అవతార్ 2 రిలీజ్ డేట్ పై కన్నేసిన అల్లు అర్జున్ ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -