Saturday, April 27, 2024
- Advertisement -

మహేష్ తో పోటీ.. ఆ పాన్ ఇండియా మూవీ నిలబడగలదా ?

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ” SSMB28 ” వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీపై మహేష్ బాబు అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ” అతడు “, ఖలేజా ” వంటి సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు వెండితెరపై ఆశించిన స్థాయిలో విజయం సాధించనప్పటికి బుల్లి తెరపై మాత్రం కల్ట్ క్లాసిక్ మూవీస్ గా నిలిచిపోయాయి. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో మరో మూవీ కోసం అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశారు. వారి ఎదురుచూపులా ఫలితంగా వీరిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ తరకెక్కుతోంది.

ఇక ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్నా ఈ మూవీ.. త్వరలో మరొక షెడ్యూల్ కు సిద్దమౌతోంది. ఇక ఈ మూవీ ని వచ్చే ఏడాది ఏప్రెల్ 28న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్రాయునిట్ ఇదివరకే ప్రకటించింది. అయితే ఇదే డేట్ పై ఇప్పుడు మారో పాన్ ఇండియా మూవీ కన్నేసినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ” పోన్నియన్స్ సెల్వన్ పార్ట్ 2 ” మూవీని వచ్చే ఏడాది ఏప్రెల్ 28 ననే విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారట.

ఇదే గనుక జరిగితే మణిరత్నం మూవీ.. తెలుగులో మహేష్ నుంచి గట్టిపోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి మహేష్ మూవీని తట్టుకొని ” పోన్నియన్ సెల్వన్ పార్ట్ 2 ” నిలబడగలదా ? అనే డౌటే అనే అనుమానాలు టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. ఇక ఇటివల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ” పోన్నియన్ సెల్వన్ పార్ట్ 1 ” జస్ట్ హిట్ గా నిలిచింది. తమిళ్ లో పరవలేదనిపించినప్పటికి, తెలుగు, హిందీ లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఈ మూవీ పార్ట్ 2 పై పాన్ ఇండియా స్థాయిలో పెద్దగా క్రేజ్ లేదు. ఈ నేపథ్యంలో మహేష్ తో పోటీకి దిగితే ” పోన్నియన్ సెల్వన్ పార్ట్ 2 ” నష్టాలు చవిచూసే అవకాశం గ్యారెంటీ అనే వాదన వినిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

నిరాశలో డార్లింగ్ ఫ్యాన్స్.. ప్రభాస్ కే ఎందుకిలా ?

సుకుమార్ తో మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్.. హీరో ఎవరో మరి !

రాంచరణ్ కు నెక్స్ట్ సినిమా కష్టాలు !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -