Sunday, May 5, 2024
- Advertisement -

ఉత్త‌రాఖాండ్‌లో ఘోర ప్ర‌మాదం… భ‌క్తుల‌పైకి దూసుకెల్లిన ట్ర‌క్కు.. 9 మంది దుర్మ‌ర‌ణం

- Advertisement -

ఉత్త‌రా ఖాండ్‌లో చంపావత్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేస‌కుంది. దైవ ద‌ర్శ‌నానికి వెల్లిన భ‌క్త‌ల‌ను మృత్యురూపంలో లారీ క‌బ‌లించింది. ప్రసిద్ధ పూర్ణగిరి ఆలయ సందర్శనకు కాలిన‌డ‌క‌న వెళ్తున్న భక్తులపైకి అతివేగంగా దూసుకొచ్చిన ట్రక్కు 11 మంది పర్యాటకులను బలి తీసుకుంది.

కంకర లాంటివి తరలించే ఆ భారీ ట్రక్కు కింద నలిగి 9 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఈ ప్రమాదంలో మరో 19 మంది వరకూ తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాలన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. రహదారి అంతా రక్త ధారలతో భయానకంగా మారింది.

చంపావత్‌ జిల్లాలోని తనక్‌పూర్‌ వద్ద శుక్రవారం (మే 18) ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని బరేలి ప్రాంతానికి చెందిన వీరంతా తమ కుటుంబసభ్యులు, బంధువులతో కలిసి పూర్ణగిరి ఆలయ దర్శనానికి వచ్చారు. మృతులంతా మ‌ధ్య వ‌య‌సువారే కావ‌డంతో వారి కుటుంబాల్లో విషాద చాయ‌లు అలుముకున్నాయి.

మరణించిన వారిలో ఐదుగురు యువకులు, నలుగురు చిన్నారులు ఉన్నారు. మృతులను కమల్ (19), వీర్‌ సింగ్‌ (18), విశాల్‌ (17), కేశర్‌ సింగ్‌ (16), రామ్ కుమార్‌ (16), దీన్‌దయాల్‌ (35), బాబు (12), సోను (8), సోహన్‌ లాల్‌ (40), రామ్‌స్వరూప్‌ (40)గా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -