- Advertisement -
ఉత్తరాఖండ్లో ఆరు నెలల తర్వాత కేదార్నాథ్ ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. దీంతో ఛార్థామ్ యాత్ర అధికారికంగా మొదలైంది.భక్తులు తెల్లవారు జాము నుంచే బారులు తీరారు. ఏటా అక్టోబర్-నవంబర్ మధ్యకాలంలో ఆలయాన్ని మూసివేయడం ఆనవాయితీ. వేసవి ప్రారంభమైన కొద్దిరోజులకు ఆలయాన్ని మళ్లీ తెరుస్తారు.
ఆలయ ద్వారాలు తెరిచిన సందర్భంగా వేలాది మంది భక్తులు శివ దర్శనం కోసం కేదార్నాథ్కు చేరుకున్నారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. యాత్రా రూట్లో ప్రత్యేక వసతులను కల్పించారు. రేపటి నుంచి బద్రీనాథ్ ఆలయం దర్శనాలు ప్రారంభం కానున్నాయి.