Thursday, May 16, 2024
- Advertisement -

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో భారీ ఎన్‌కౌంట‌ర్ 12 మంది మావోలు మృతి..

- Advertisement -

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో శుక్రవారం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంట‌ర్‌లో మావోయిస్టుల‌కు భారీ ఎదురు దెబ్బ త‌గిలింది. తెల్ల‌వారు జాముల‌న జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో 12 మంది మావోయిస్టుల‌తోపాటు గ్రేహౌండ్స్‌కు చెందిన సుశీల్‌ అనే కానిస్టేబుల్ మృతి చెందారు.

భద్రాది జిల్లా చర్ల సమీపంలోని తొండపాల్ అటవీ ప్రాంతం వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో పన్నెండు మంది మావోలు హతమవగా, గ్రేహౌండ్స్‌కు చెందిన ముగ్గురు కానిస్టేబుల్స్‌ గాయపడ్డారు. మృతుల్లో మావోయిస్ట్‌ అగ్రనేత హరిభూషణ్ ఉన్నట్టు సమాచారం. తెలంగాణ మావోయిస్ట్ సెక్రెటరీగా హరిభూషణ్ విధులు నిర్వహిస్తున్నారు. పోస్టుమార్టం కోసం మావోల మృతదేహాలను భద్రచాలం ఆస్పత్రికి తరలించారు. సంఘ‌ట‌నా స్థ‌లంనుంచి తుపాకులు, స్కానర్‌, ల్యాప్‌ట్యాప్‌, రూ.41వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

గతేడాది డిసెంబర్‌లో ఇదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చండ్ర పుల్లారెడ్డి బాట దళానికి చెందిన ఎనిమిది మంది నక్సల్స్‌ చనిపోయిన సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -