Monday, May 6, 2024
- Advertisement -

శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం ప‌ట్టివేత‌…

- Advertisement -

శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. కస్టమ్స్‌ అధికారులు ఇద్దరు ప్రయాణికుల నుంచి మూడు కేజీల 329 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ బంగారం తీసుకువస్తున్నట్లు గుర్తించారు. బంగారం తరలిస్తున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

దుబాయి నుంచి వచ్చిన ఇండిగో విమానంలో ఇద్దరు ప్రయాణికులు దిగారు. వీరు లో దుస్తుల్లో ప్రత్యేక జేబులు ఏర్పాటు చేసుకుని అందులో బంగారం బిస్కెట్లు ఉంచారు. విమానం దిగిన ప్రయాణికులను తనిఖీ చేస్తున్న కస్టమ్స్‌ అధికారులకు వీరిపై అనుమానం రావడంతో సునిశితంగా తనిఖీచేశారు. దీంతో లోదుస్తుల్లో ఉన్న బంగారం బయటపడింది. ఈ బంగారం విలువ కోటి రూపాయలకు పైగానే ఉంటుందని కస్టమ్స్‌ అధికారులు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -