Friday, March 29, 2024
- Advertisement -

ముంబైలో కుప్పకూలిన 4 అంతస్థుల భవనం.. 9 మంది మృతి

- Advertisement -

ముంబైలోని మల్వాని ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. నాలుగు అంతస్తుల భవనం కూలిన ఘటనలో 9 మంది మృతి చెందారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. గత రాత్రి 11.10 గంటల సమయంలో జరిగిందీ ఘటన. ముంబైలో గత కొన్ని రోజులుగా భారీగా వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పాత భవనం కుప్పకూలినట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో చిన్నారులు సహా పలువురు ఉన్నారు.

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు స్థానికులతో కలిసి సహాయక కార్యక్రమాలు చేపట్టారు. ప్రస్తుతం సహాయక కార్యక్రమాలు ఇంకా కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న 15 మందిని రక్షించారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. ఇక ఈ భవనం చుట్టు కూడా పలు పాతభవనాలు ఉన్నాయి.. దాంతో ఈ భవనాలకు కూడా ప్రమాదం ఉండడంతో అందులోని వారిని ఖాళీ చేయించినట్టు బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ తెలిపింది.

ముంబైలో కురుస్తున్న భారీ వర్షాల వల్లే భవనం కూలినట్టు మహారాష్ట్ర మంత్రి అస్లాం షేక్ తెలిపారు. మరోవైపు ముంబై సహా పలు జిల్లాలలో మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్న వాతావరణ శాఖ ‘ఆరెంజ్ అలెర్ట్’ ప్రకటించింది.

టాలీవుడ్ విషాదం : ఘంటసాల రెండో కుమారుడు రత్నకుమార్‌ కన్నుమూత

నేటి పంచాంగం,గురువారం(10-06-2021)

ఆశ్చర్యం.. చికెన్​ లెగ్​పీస్​ రూ. 73 లక్షలు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -