Thursday, May 9, 2024
- Advertisement -

భేష‌రతుగా క్షమాపణలు చెప్తారా… క్రిమిన‌ల్ చ‌ర్య‌లు ఎదుర్కొంటారా…?

- Advertisement -

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ లీగల్ నోటీసులు పంపించారు. తన సంస్థపై ఊహాజనితంగా చేసిన ఆరోపణలను, ట్వీట్లను బేేషరతుగా ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణలు చెప్పాలని, లేదంటే తాను తీసుకోబోయే సివిల్, క్రిమినల్ చర్యలకు సిద్ధంగా ఉండాలని నోటీసులో పేర్కొన్నారు

గత కొన్ని రోజులుగా మీడియా పెద్దలను లక్ష్యంగా చేసుకుని జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ వరుస ట్వీట్లతో హోరెత్తిస్తోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టీవీ9 రవిప్రకాశ్, ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణలపై ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు. పవన్ ఆరోపణలపై ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ స్పందిస్తూ ఆయన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.

అనుకున్న‌ట్లుగానే లీగ‌ల్ నోటీసులు పంపారు. బహిరంగ క్షమాపణలు చెప్పాలని లేకుంటే తాను వేయబోయే పరువు నష్టం దావాను ఎదుర్కొండానికి సిద్ధంగా ఉండాలని నోటీసులో పేర్కొన్నారు. పవన్ ఆరోపిస్తున్నట్టు తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధాలు లేవన్నారు. ట్విట్టర్‌లో పవన్ కొన్ని రోజులుగా చేస్తున్న ట్వీట్లతో ఆయన అభిమానుల్లో అసహనం పెరిగిందని, ఈ కారణంగానే ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ప్రతినిధులపై దాడిచేశారని, వాహనాలను ధ్వంసం చేశారని ఆర్కే తన నోటీసుల్లో పేర్కొన్నారు.

జనసేన అధినేత కేవలం రాజకీయ ప్రయోజనాలను ఆశించే నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. నేరపూరిత కుట్రలో భాగంగా మరికొందరితో కలిసి పవన్ ఈ ట్వీట్లు చేస్తున్నట్టు తాను బలంగా నమ్ముతున్నానని ఆర్కే వివరించారు. ఆయన ట్వీట్ల కారణంగా తనకు వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగిందని, సంస్థలకు నష్టం వాటిళ్లిందని తన నోటీసులో పేర్కొన్నారు. తన పరువుకు భంగం కలిగించే విధంగా పవన్ చేసిన ట్వీట్లపై వివరణ ఇచ్చి బహిరంగంగా, లిఖితపూర్వక క్షమాపణలు చెప్పాలని వేమూరి రాధాకృష్ణ డిమాండ్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -