ప్రస్తుతం గృహోపకరణాలకు భారీగా డిమాండ్ ఉంది. ఇప్పటి వరకు తక్కువ ధరకు ప్రీజ్లు,ఏసీలు, వాషింగ్ మెషీన్లు ఇతర వస్తువులు వస్తున్నాయి. అయితె వచ్చె నెల నుంచి ఇవి మరింత కాస్ట్లీగా మారబోతున్నాయి. వీటి ధరలు అమాంతంగా -5 శాతం పెరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
ముడిసరు ధరలు పెరగడంతో ధరలు పెంచాలని ఈ వైట్ గూడ్స్ తయారీదారులు ఆలోచిస్తున్నట్లు ఇండస్ట్రి వర్గాలు చెబుతున్నాయి. గత ధరల పెంపు నుంచి ఇప్పటి వరకు ఇన్పుట్ వ్యయాలు 30-35 శాతం మేర పెరిగినట్టు తెలిసింది. స్టీల్ ధర 40 శాతం, కాపర్ ధర 50 శాతం పెరగడంతో పాటు రిఫ్రిజిరేటర్లలో ఎక్కువగా వినియోగించే కీలక కెమికల్ ఎండీఐ అంతర్జాతీయంగా లోపించింది. దీంతో ఇన్పుట్ వ్యయాలు రెండింతలు పైకి ఎగిశాయి.
ఈ మూడు కలిపి ఇన్పుట్ వ్యయాల్లో 70 శాతం మేర నమోదవుతున్నాయి.. దీంతో వైట్ గూడ్స్ ధరలపై నికరంగా 5-6 శాతం ప్రభావం పడనుందని గోద్రెజ్ అప్లియెన్స్ బిజినెస్ హెడ్ కమల్ నంది చెప్పారు. దీనిలో కొంత కంపెనీలు భరించి, మిగిలిన మొత్తం వినియోగదారులపై విధించనున్నట్టు పేర్కొన్నారు.
తొలుత రిఫ్రిజిరేటర్ల ధరలు వచ్చే నెల నుంచి ఈ పెంపు ఉండనుంది. తర్వాత వాషింగ్ మిషన్లు, అనంతరం జనవరి నుంచి ఏసీ ధరలు పెంచనున్నారు. మార్కెట్ లీడర్లుగా ఉన్న ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా, దాని ప్రత్యర్థి శాంసంగ్లు కూడా ఈ కేటగిరీ ఉత్పత్తులపై ధరల పెంపుకు సన్నాహాలు చేస్తున్నాయని దిగ్గజ రిటైల్ చైన్ చీఫ్ చెప్పారు. అయితే శాంసంగ్ ధరల పెంపును ఖండించగా.. ఎల్జీ ఇంకా స్పందించలేదు.