Thursday, May 2, 2024
- Advertisement -

హ‌జీపూర్ జంట హ‌త్య‌ల న‌ర‌హంత‌కుడు ఇత‌డేనా…?

- Advertisement -

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హజీపూర్‌లో ని బావిలో ఇద్ద‌రు బాలిక‌ల హ‌త్య కేసు జిల్లాలో క‌ల‌క‌ల రేపుతోంది. రెండు రోజుల వ్య‌వ‌ధిలోనె రెండు మృదేహాలు బ‌య‌ట‌ప‌డ‌టంతో హజీపూర్ ఉత్కంఠ‌ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. దీంతో అక్క‌డ భారీగా పోలీసుల‌ను మోహ‌రించారు. ఈ జంట హ‌త్య కేసులో పోలీసులు కొంత పురోగ‌తి సాధించారు.శ్రావణి, మనీషా హత్య కేసులో అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హాజీపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి తో పాటు మ‌రికొంత మందిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారిస్తున్నారు.

త‌న దైన శైలిలో పోలీసులు విచార‌ణ చేయ‌డంతో అసలు నిజాలు వెలుగులోకి వ‌చ్చాయి.. శ్రీనివాస్‌రెడ్డిని విచారిస్తున్న సమయంలోనే మనీషా హత్య వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చింది. మనీషాపై అత్యాచారం చేసి.. హత్య చేసినట్టు నిందితుడు పోలీసుల ముందు అంగీకరించాడు. శ్రీనివాస్‌రెడ్డి వాంగ్మూలంతోనే పోలీసులు మనీషా మృతదేహాన్ని వెలికితీశారు.

ఇద‌లా ఉంటె శ్రీనివాస‌రెడ్డి కుటుంబం ఉరు విడిచి పారిపోయిన‌ట్లు స‌మాచారం.కీసరలో ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌రెడ్డిపై కర్ణాటక, హైదరాబాద్‌లో పలు కేసులు ఉన్నాయంటున్నారు పోలీసులు. మనీషాతో పాటు శ్రావణిని కూడా హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరు అమ్మాయిలను శ్రీనివాస్‌రెడ్డి బలితీసుకున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -