- Advertisement -
తెలుగు, తమిళ, మలయాళ హిందీ చిత్రపరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ప్రముఖ నటి శ్రీదేవి ఇక లేరు. బాలీవుడ్ నటుడు మోమిత్ మార్వా వివాహం కోసం భర్త బోనీకపూర్, చిన్న కుమార్తె ఖుషి కపూర్తో కలిసి దుబాయ్ వెళ్లిన శ్రీదేవి శనివారం అర్ధరాత్రి దాటక దుబాయ్లో గుండెపోటుతో కన్నుమూశారు.
కొన్ని దశాబ్దాలపాటు చిత్రపరిశ్రమను ఏలిన ఆమె మరణవార్త తెలిసి దేశం మొత్తం మూగబోయింది. సినీ ప్రేక్షకులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. శ్రీదేవి మరణవార్తతో మొత్తం సినీలోకం తీవ్ర దిగ్భ్రాంతిలో కూరుకుపోయింది.