Friday, April 26, 2024
- Advertisement -

ఆపి మాజీ అధ్యక్షుడు అజయ్​ లోధా మృతి..!

- Advertisement -

ప్రముఖ ప్రవాస భారతీయ ఫిజీషియన్​ అజయ్​ లోధా(58) కొవిడ్​-19తో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. భారత సంతతి ఫిజీషియన్ల సంస్థ(ఆపి) మాజీ అధ్యక్షుడైన అజయ్.. ఎనిమిది నెలల కిందట కరోనా బారినపడ్డారు. అప్పటినుంచి ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 21 మృతి చెందారు.

ప్రతిష్ఠాత్మక ఇల్లిస్​ ఐలాండ్​ పతకం 2016లో లోధాను వరిచింది. రాజస్థాన్ అసోసియేషన్​ ఆఫ్​ నార్త్​ అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన అజయ్​ మృతిపై.. న్యూయార్క్​లోని భారత కాన్సులేట్​ జనరల్​, రాజస్థాన్​ మాజీ సీఎం వసుంధర రాజె, బీఎస్​ఎఫ్​ మాజీ డైరెక్టర్​ జనరల్​ కేకే శర్మతో పాటు చాలా మంది ప్రముఖ ప్రవాస భారతీయులు సంతాపం తెలిపారు. వీరిలో ఆపి అధ్యక్షుడు సుధాకర్​ జొన్నలగడ్డ, ఆపి అధ్యక్షురాలిగా ఎన్నికైన డాక్టర్​ అనుపమ గోటిముకుల, ఉపాధ్యక్షుడు డా. రవి ఉన్నారు. వైద్యుడిగా సమాజానికి ఆయన చేసిన సేవలను వారు కొనియాడారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -