Tuesday, May 14, 2024
- Advertisement -

మంత్రి పీతల సుజాతకు మరో రహస్యకానుక..!

- Advertisement -

ఇది వరకూ కొంతమంది నుంచి వడ్డాణాన్ని గిఫ్ట్ గా తీసుకొని వివాదాల పాలయ్యింది మంత్రి పీతల సుజాత.

మంత్రిగారిని సత్కరించి.. ఆమెకు వడ్డాణాన్ని ఇచ్చి ఆమె ఆదరాభిమానాలను సొంతం చేసుకొన్నారు కొంతమంది అవినీతి పరులు. ఈ అంశం గురించి ప్రతిపక్ష వైస్సార్ కాంగ్రెస్ వారు శాసనసభలో కూడా అలజడి రేపారు. మంత్రి వడ్డానాన్ని గిఫ్ట్ గా తీసుకోవడం గురించి సభలో రచ్చ జరిగింది. ఆ తర్వాత కూడా మంత్రి ఇంటి దగ్గర ఒక డబ్బు కవర్ ఒకటి దొరకడం వివాదంగా మారింది. మరి వరసగా అలాంటి పరిణామాల అనంతరం ఇప్పుడు.. పీతల సుజాత మరో వివాదంలో ఇరుక్కొంది.

ఆమెకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఉద్యోగులు ఒక ఘనమైన కానుకనే ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మంత్రిగారి వీక్ నెస్ ను ఎరిగిన వాళ్లు ఒక పట్టుచీర, డాలర్ తో కూడిన నెక్లెస్ ను ప్రెజెంట్ చేసినట్టుగా తెలుస్తోంది. వీటన్నింటినీ బాక్స్ లో పెట్టి మంత్రిగి కానుకగా సమర్పించినట్టు సమాచారం. ఈ విషయం గురించి స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులే మీడియాకు సమాచారం అందించారు. మంత్రి గారికి ఉద్యోగులు ఒక్కోరు ఐదు వేల రూపాయల చొప్పున పోగేసి.. ఈ కానుకను ఇచ్చినట్టుగా తెలుస్తోంది. పట్టు చీరే దాదాపు 90 వేల రూపాయలు విలువచేస్తోందని సమాచారం.

మరి అధికారంలోకి వస్తూ వస్తూనే వడ్డానం స్వీకరించి వార్తల్లోకి వచ్చిన పీతల సుజాత.. ఇలా వరసగా అవినీతి వ్యవహారాలకు సంబంధించిన వార్తల్లో రావడం విశేషం. ఏదో ఒకసారి అంటే పొరపాటు జరిగిందని అనుకోవచ్చు కానీ..ఏడాదిలోనే మూడుసార్లు ఇలా కానుకలు, గిఫ్ట్ లు..అంటూ అవినీతి సొమ్ముతో వార్తల్లోకి రావడం చాలా దారుణమైన అంశం. దీని గురించి బాబు ఏమైనా చర్యలు తీసుకొంటారా?!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -