ఏపీ రాజధాని అమరావతిలో జరిగిన మంత్రివర్గ సమావేశం గురువారం సాయంత్రం ముగిసింది. సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఈ భేటీలో మంత్రివర్గం పలు అంశాలపై చర్చించింది. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లించాలని నిర్ణయించారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12.26లక్షలమందికి రూ.100చొప్పున భృతి ఇవ్వాలని తీర్మానించారు. ఈ పథకానికి ‘ముఖ్యమంత్రి యువనేస్తం’గా పేరు పెట్టారు. అలాగే త్వరలో 20వేల ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డీఎస్సీతో పాటు మిగిలిన శాఖల్లో పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.
కుప్పంలో ఎయిర్స్ట్రిప్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కొత్త చేనేత విధానాన్ని ఆమోదంతో పాటూ.. ఫిజియోథెరపిస్టుల రాష్ట్ర కౌన్సిల్ ఏర్పాటుకు గ్రీన్సిగల్న్ ఇచ్చారు. విశాఖ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పేరును.. వైజాగ్ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఉడాకు మెడ్టెక్ జోన్ చెల్లించాల్సిన రూ.11 కోట్ల పన్నుకు మినహాయింపుకు ఆమోదం తెలిపారు.
వీఎమ్ఆర్డీ పరిధి 5573 చ.కి.మీ. నుంచి 6764.59 చ.కి.మీ వరకు పెంచారు. ఈ నిర్ణయంతో వీఎమ్ఆర్డీ పరిధిలో 48 మండలాలు, 1340 గ్రామాలు ఉండనున్నాయి. కేబినెట్ భేటీ దాదాపు నాలుగు గంటల పాటు సాగింది. ఈ నెల 20వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండే అవకాశముంది.