- Advertisement -
తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని వాజ్పేయిని పరామర్శించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢీల్లీ పయనం కానున్నారు. సాయంత్రం ఢిల్లీ వెళ్లి ఎయిమ్స్లో చికిత్స పొందుతున్నవాజ్పేయిని చంద్రబాబు పరామర్శించనున్నారు.
వాజపేయితో వ్యక్తిగతంగా చంద్రబాబుకు ఎంతో అనుబంధం ఉంది. వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఎన్డీయేలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉంది. చంద్రబాబుకు వాజపేయి ఎంతో గౌరవం ఇచ్చేవారు. వాజపేయి ఆరోగ్యం విషమించిన నేపథ్యంలో ఈ మధ్యాహ్నం చంద్రబాబు ట్విట్టర్ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. ‘వాజపేయి ఆరోగ్యం విషమించిందన్న వార్తతో తన మనసు ఎంతో బాధపడుతోంది. ఆయన త్వరగా కోలుకోవాలి’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.