- Advertisement -
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణికి ఇవాళ విజయనగరంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. సార్వత్రిక ఎన్నికల్లో కురుపాం ఎస్టీ నియోజకవర్గం నుంచి రెండోసారి అత్యధిక మెజార్టీతో గెలుపొందడమేకాక, రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు పుష్ప శ్రీవాణి.
మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఇవాళ తొలిసారిగా ఆమె జిల్లాకు వస్తుండడంతో భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా జిల్లాలోని రాజాపులోవ వద్ద ఏర్పాటు చేసిన వేదికపై ఎక్కువ మంది కార్యకర్తలు ఎక్కడంతో వేదిక ఓ పక్కకు ఒరిగింది. భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఆమెను వేదిక పైనుంచి కిందకు దించారు.అంతా క్షేమంగా బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు.