ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జిని మన దేశంలో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. జమ్ముకశ్మీర్లో చీనాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో ఈ బ్రిడ్జ్ను నిర్మిస్తున్నారు. కాగా, ఈ బ్రిడ్జి కీలకమైన ఆర్క్ నిర్మాణం పూర్తి చేసుకుంది. జమ్ముకశ్మీర్లో చీనాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో ఈ బ్రిడ్జిని నిర్మించారు. ప్యారిస్లోని ఈఫిల్ టవర్ కన్నా దీని ఎత్తు 35 మీటర్లు ఎక్కువ కావడం విశేషం. 1.3కి.మీ పొడవైన ఈ బ్రిడ్జిని రూ.1,486 కోట్ల ఖర్చుతో నిర్మించారు.
ఉధమ్పూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్ట్(యూఎస్బీఆర్ఎల్)లో భాగంగా దీన్ని నిర్మించారు. కశ్మీర్ను మిగిలిన దేశంలో అనుసంధానించడంలో భాగంగా చేపట్టిన యూఎస్బీఆర్ఎల్ ప్రాజెక్ట్లో సోమవారం(ఏప్రిల్ 5,2021) ఓ చారిత్రక మైలురాయిని నార్తర్న్ రైల్వేస్ పూర్తి చేసింది. ప్రాజెక్ట్ మొత్తం రెండున్నరేళ్లలో పూర్తవుతుంది అని నార్తర్న్ రైల్వేస్ జనరల్ మేనేజర్ అశుతోష్ గంగాల్ తెలిపారు. అత్యంత తీవ్రమైన భూకంపాలను కూడా తట్టుకోగలదు.
బ్రిడ్జి నిర్మాణంలో వాడిన స్టీల్ 10డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నుంచి 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వరకూ మన్నికగా ఉండగలదు. యూఎస్బీఆర్ఎల్ పూర్తి ప్రాజెక్టు మరో రెండున్నరేళ్లలో పూర్తి చేయనున్నారు. రెండు భాగాలుగా ఉన్న ఆర్క్ను కలిపే 5.6 మీటర్ల లోహాన్ని సోమవారం కలిపి మొత్తం నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది.
ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో మొత్తం 28,660 మెట్రిక్ టన్నుల స్టీలు, 66 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటును వాడినట్లు అశుతోష్ వెల్లడించారు.ప్రపంచంలోనే అతి ఎత్తయిన ఈ బ్రిడ్జ్ ఆర్క్ నిర్మాణం పూర్తయ్యే ఘట్టాన్ని వీడియో లింక్ ద్వారా రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ వీక్షించారు.
రసవత్తరంగా కొనసాగుతున్న పోలింగ్..!
జిందగీ కొత్తగా నవ్వుతోందంటున్న’ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’