జిందగీ కొత్తగా నవ్వుతోందంటున్నారు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్స్’ అఖిల్ అక్కినేని – పూజా హెగ్దేలు. ప్రస్తుతం వీరిద్దరు కలిసి నటిస్తున్న చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు భాస్కర్ బొమ్మరిల్లు తెరకెక్కిస్తున్నారు. ఇది వరకే ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన పోస్టర్, ట్రైలర్ , లిరికల్ వీడియో సాంగ్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.
దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్స్ సినిమాలోని ఏ జిందగీ అంటూ సాగుతున్న మరో లిరికల్ సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘ఆకాశమంతా ఆనందమై తెల్లారుతోందే నాకోసమై..ఆలోచనంతా ఆరాటమై..అన్వేషిస్తోందే ఈ రోజుకై’ అంటూ పూజాహెగ్డే, అఖిల్ మధ్య సాగే ఈ మెలోడీయస్ సాంగ్ కు మ్యూజిక్ లవర్స్ నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.
ఈ పాటకు రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా గోపీ సుందర్ బాణీలు కూర్చారు. ఈ పాటను హనియా నఫీస, గోపీసుందర్ లు కలిసి పాడారు. ఈ లిరికల్ వీడియోలో బొమ్మరిల్లు భాస్కర్, మోహన్రాజాతో కలిసి సరదాగా కారులో డ్రైవ్ చేస్తూ పాటను ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే, గోపీసుందర్, హనియా నఫీస డ్రైవ్లో సాంగ్ను పాడుతూ హమ్ చేస్తున్నారు. అఖిల్-పూజా హెగ్దేలులు తళుక్కున్న మెరుస్తున్నారు. దీనిపై మీరు ఓ లుక్కేయండి ఇక !
తెలుగువారు గర్వించదగ్గ మూవీ ఇది: మెగాస్టార్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఓ ట్రెండ్ సెట్టర్ !
అల్లు అరవింద్కు కరోనా.. ఏం జరిగిందంటే !