Sunday, May 19, 2024
- Advertisement -

మోడీ కి వార్నింగ్ ఇచ్చిన బాలకృష్ణ !

- Advertisement -

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం మీద మొన్నటి వరకూ తనకి పెద్ద అవగాహన లేదు అని చెబుతూ ఉండే బాలకృష్ణ ఇన్నాళ్ళ తరవాత తన మనసులో మాటని బయట పెట్టారు. ఇవాళ మీడియా తో మాట్లాడిన ఆయన పరోక్షంగా బీజేపీ కీ మోడీ కి వార్నింగ్ ఇచ్చినట్టు కనిపించింది. 

కేన్సర్ మీద అవగాహన కార్యక్రమం నిర్వహించగా అందులో పాల్గొన్న బాలయ్య ఏపీ కి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం జరిగితే తెలుగు వారి ఆత్మగౌరవం దెబ్బ తీసిన వారు అవుతారు అని అన్నారు.ప్రత్యేక హోదా ఇవ్వకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అబిప్రాయపడ్డారు. 

దశల వారీగా ఏపీకి ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చాలన్నారు. హామీల్లో భాగంగానే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారన్నారు. పరిస్థితి చేయి దాటేంత వరకు కేంద్రం చూస్తూ ఊరుకోవద్దన్నారు. ఆయన పరోక్షంగా మోడీ కి వార్నింగ్ ఇచ్చినట్టు కనిపించింది 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -