- Advertisement -
భద్రాచలంలో సీతా రామచంద్రులకు ఎంతో వైభవంగా వసంతోత్సవం నిర్వహించారు. ప్తరి ఏటా స్వామి కల్యాణం.. పట్టాభిఫేకాల తర్వాత వసంతోత్సవం జరుపుతారు. అలాగే ఈ వేడుకలకు ముందు ధ్వజారోహణం చేసిన ఎనిమిదోరోజు వసంతోత్సవం జరపడం అనాదిగా వస్తోంది.
ఈ ఉత్సవంలో భాగంగా స్వామికి పసుపు, కుంకుమ, బుక్కాలతో పాటు సుగంధ ద్రవ్యాలను చల్లుతూ గర్భాలయం నుంచి వసంతోత్సవం జరిగే చోటుకు తీసుకువచ్చారు. శ్రీరామచంద్రుల వారికెదురుగాసీతమ్మని కూర్చోపెట్టి వసంతాన్ని చల్లారు.
ఈ సందర్భంగా భక్తులు కూడా వసంతాన్ని చల్లుకున్నారు. వసంతోత్సవంలో భాగంగా సీతారామచంద్రులకు తిరువీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.