Friday, April 19, 2024
- Advertisement -

న‌టి భానుప్రియ వేధింపుల కేసులో కొత్త ట్విష్ట్‌..

- Advertisement -

చిన్నారిని వేధిస్తున్నారంటూ టాలీవుడ్ సీనియర్ నటి భాను ప్రియపై రీసెంట్ గావ‌చ్చిన ఆరోప‌న‌ల‌పై ఆమె స్పందించారు. తన కుమార్తెను వేధిస్తున్నారంటూ పండ్రవాడకు చెందిన ప్రభావతి అనే మహిళ భానుప్రియపై తనపై తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెట్టిన సంగ‌తి తెలిసిందే.

దీనిపై స్పందించిన భానుప్రియ సంధ్య(14) అనే బాలిక తమ ఇంట్లో సంవత్సర కాలంగా పనిచేస్తోందని.. ఈ నేపథ్యంలో దాదాపు రూ.లక్షా 50 వేల విలువైన డబ్బు, బంగారం, కెమెరా, ఐప్యాడ్‌ను దొంగిలించిందని తెలిపారు. ఆ వస్తువులను తిరిగి ఇవ్వమని అడిగితే ప్రభావతి తమపై తప్పుడు కేసు పెట్టారని పేర్కొన్నారు. తమ ఇంట్లో వస్తువులను చోరీ చేసినందుకు సంధ్యపై చెన్నైలో కేసు నమోదు చేయనున్నట్టు వెల్లడించారు .

భానుప్రియ‌పై వ‌చ్చిన ఆరోప‌న‌ల మీద సంధ్యకూడా స్పందించారు. భానుప్రియ, ఆమె సోదరుడు నన్ను బాగా చూసుకుంటున్నారు. వారికి తెలియకుండా నగలు, డబ్బు, ఎలక్ట్రానిక్‌ వస్తువులను దొంగిలించి మా అమ్మకు ఇచ్చాను. వస్తువులు చోరీకి గురైనట్టు వారు గమనించడంతో.. వాటిని తిరిగివ్వాలని మా అమ్మకు చెప్పాను. అయితే వాటిని తీసుకువస్తానని చెప్పిన అమ్మ.. తప్పుడు కేసు పెట్టింద’ని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -