Monday, May 6, 2024
- Advertisement -

ఒళ్లు గ‌గ్గుర‌పొడిచే ఘోర రోడ్డు ప్ర‌మాదం…క్ష‌ణాల్లో బూడిద‌యిన యువ‌కుడు

- Advertisement -

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మితిమీరిన వేగం కర్నాటకలో ఓ వ్యక్తి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. బెంగళూరు నుంచి తిరుపతి వస్తున్న వ్యక్తి నడిరోడ్డుపై సజీవదహనం అయ్యాడు. ప్రమాదం జరిగిన తీరు స్థానికులను తీవ్ర భయభ్రాంతులకు గురిచేసింది.

కోలార్ జిల్లా బంగారుపేట వద్ద బైకుపై వేగంగా వెళుతున్నాడు. యమహా బైక్‌పై వేగంగా దూసుకువస్తున్న 21 ఏళ్ల నీరజ్.. కోలార్ జిల్లా, బంగారుపేట ప్రాంతంలో ఓ ప్రైవేట్ బస్సును ఢీ కొట్టాడు. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు ఉవ్వెత్తున ఎగబాకడంతో ఎటూ కదలలేని పరిస్థితిలో నీరజ్ రోడ్డుపైనే క్ష‌ణాల్లో సజీవదహనమయ్యాడు.

బస్సును ఢీ కొన్న వెంటనే మంటలు చెలరేగి యువకుడిని చుట్టుముట్టాయని… రక్షించేందుకు అవకాశమే దొరకలేదని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటల ధాటికి గుర్తుపట్టలేనంతగా అతని శరీరం కాలిపోవడంతో మృతుడి వివరాలు సేకరించడం పోలీసులకు కష్టంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -