నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత తొలిసారి గరవ్నర్గా నియమితులైన ఒడిశా సీనియర్ బీజేపీ సీనియర్ నేత బిశ్వభూషన్ హరిచందన్ ఉదయం 11.30 గంటలకు ప్రమాణస్వీకారం చేశారు. ఆయన చేత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి ప్రవీణ్కుమార్ పదవీ ప్రమాణం చేయించారు. దీంతో రాష్ట్రవిభజన తర్వాత ఏపీకీ పూర్తి కొత్త గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి గవర్నర్గా ఉన్న నరశింహన్ ను తెలంగాణా గవర్నర్గా కొనసాగుతున్నారు.
విజయవాడలోని రాజ్భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. ఇంకా ఈ కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతమ్ సవాంగ్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, హైకోర్టు న్యాయమూర్తులు, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు హజరయ్యారు.