Saturday, May 4, 2024
- Advertisement -

బాబూ జ‌ర జాగ్ర‌త్త అంటున్న సోమువీర్రాజు..

- Advertisement -

ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. రాష్ట్రంలో చంద్రబాబు బరితెగించి అవినీతికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.ఎయిర్ పోర్టులకు సేకరించిన భూమిని ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. చివరకు స్కూలు భవనాలకు రంగులు వేసే పనుల్లో కూడా అవినీతి జరుగుతోందని మండిపడ్డారు. బాబు పాల‌న‌లో అవినీతి రాజ్య‌మేలుతోంద‌ని ఆరోప‌న‌లు చేశారు.

చంద్రబాబు చేస్తున్నదంతా భగవంతుడు చూస్తున్నాడని, ఆయన అవినీతికి పంచభూతాలే సాక్ష్య‌మ‌ని చంద్రబాబు జాగ్రత్తగా ఉండాలని సోము వీర్రాజు హెచ్చరించారు. బాబు అవినీతికి పాల్ప‌డుతుంటూ గ‌వ‌ర్న్ ఆల‌యాల చుట్టూ ప్ర‌ద‌క్షిన‌లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. అవినీతి చక్రవర్తి చంద్రబాబును వెంటనే బర్తరఫ్ చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -