Saturday, May 18, 2024
- Advertisement -

అగ్రనేతకు తోడు నీడా

- Advertisement -

భారత ఉప ప్రధాని, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు ఎల్.కె.అద్వానీ సతీమణి కమలా అద్వానీ కన్నుమూసారు. ఆమెకు 83 ఏళ్లు. గతకొంతకాలంగా అనారోగ్యంగా ఉన్న కమలా అద్వానీ బుధవారం సాయంత్రం ఆరోగ్యం మరింత క్షీణించింది. వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్యం ప్రారంభించారు.

అయితే కమలా అద్వానీకి ఆ సమయంలో గుండెపోటు కూడా రావడంతో ఆమె మరణించినట్లుగా డాక్టర్లు ప్రకటించారు. దాదాపు ఐదు దశాబ్దాలుగా కమలా అద్వానీ తన భర్త ఎల్. కె. అద్వానీకి చేదోడు వాదోడుగా ఉన్నారు. అయితే అద్వానీ ఎంత పెద్ద పదవిలో ఉన్నా ఆయన భార్య మాత్రం రాజకీయాల్లో కాని, ప్రభుత్వంలో కాని ఎటువంటి జోక్య చేసుకునే వారు కాదు.

అద్వానీ రథయాత్ర చేపట్టినప్పుడు కమలా అద్వానీ ఆయన వెంటే ఉన్నారు. ఆమె మృతికి ప్రధాని, రాష్ట్రపతి, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం తెలిపారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -