ఐరోపా సమాఖ్యతో బ్రెగ్జిట్ అనంతరం వర్తక ఒప్పందాలను కుదుర్చుకునేందుకు బ్రెగ్జిట్ మధ్యవర్తులకు మూడు రోజుల గడువు విధించింది ఐరోపా పార్లమెంట్. ఆదివారం నాటికి ఒప్పందం సిద్ధం కాకపోతే.. దాన్ని ఈ ఏడాదే ఆమోదించేందుకు ఐరోపా పార్లమెంట్ సభ్యులకు సమయం ఉండదని స్పష్టం చేసింది. ఈ మేరకు అల్టిమేటం జారీ చేసింది.
ఒప్పందంపై జరిగిన చర్చల గురించి ఈయూ ముఖ్య మధ్యవర్తి మైకేల్ బార్నియర్ వివరాలు సమర్పించిన అనంతరం పార్లమెంట్ ఈ మేరకు స్పందించింది. ఈ నెల చివరినాటికి ప్లీనరీ సమావేశం నిర్వహించేందుకు సిద్ధమేనని, అయితే డిసెంబర్ 20 అర్ధరాత్రిలోపు ఒప్పందం పూర్తి కావాలని షరతు విధించింది. గడువు తర్వాత ఒప్పందం ఖరారైతే.. దాన్ని 2021లోనే ఆమోదిస్తామని వెల్లడించింది. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు బోరిస్ జాన్సన్కు ఆదివారం వరకు సమయమిస్తున్నామని పేర్కొంది.
బ్రెగ్జిట్ వాణిజ్యానికి సంబంధించి ఏ ఒప్పందాన్నైనా బ్రిటన్ పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంటుంది. కానీ, బ్రిటన్ పార్లమెంట్ సభ్యులు శుక్రవారం నుంచి జనవరి 5 వరకు క్రిస్మస్ సెలవుల్లో ఉండనున్నారు. అయితే.. ఒకవేళ ఒప్పందం చివరిదశకు చేరుకుంటే 48 గంటల నోటీసుతో వారిని వెనక్కి రప్పిస్తామని ప్రభుత్వం చెబుతోంది.
ఒబామా పుస్తకం అమ్మకాలలో కొత్త రికార్డ్..!
ఎఫ్డీఏ కోసం మోడెర్నా తిప్పలు..!