Wednesday, May 1, 2024
- Advertisement -

48 గంటల నోటీసుతో బ్రిటన్ కొత్త పోరాటం..!

- Advertisement -

ఐరోపా సమాఖ్యతో బ్రెగ్జిట్ అనంతరం వర్తక ఒప్పందాలను కుదుర్చుకునేందుకు బ్రెగ్జిట్ మధ్యవర్తులకు మూడు రోజుల గడువు విధించింది ఐరోపా పార్లమెంట్. ఆదివారం నాటికి ఒప్పందం సిద్ధం కాకపోతే.. దాన్ని ఈ ఏడాదే ఆమోదించేందుకు ఐరోపా పార్లమెంట్ సభ్యులకు సమయం ఉండదని స్పష్టం చేసింది. ఈ మేరకు అల్టిమేటం జారీ చేసింది.

ఒప్పందంపై జరిగిన చర్చల గురించి ఈయూ ముఖ్య మధ్యవర్తి మైకేల్ బార్నియర్ వివరాలు సమర్పించిన అనంతరం పార్లమెంట్ ఈ మేరకు స్పందించింది. ఈ నెల చివరినాటికి ప్లీనరీ సమావేశం నిర్వహించేందుకు సిద్ధమేనని, అయితే డిసెంబర్ 20 అర్ధరాత్రిలోపు ఒప్పందం పూర్తి కావాలని షరతు విధించింది. గడువు తర్వాత ఒప్పందం ఖరారైతే.. దాన్ని 2021లోనే ఆమోదిస్తామని వెల్లడించింది. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు బోరిస్ జాన్సన్​కు ఆదివారం వరకు సమయమిస్తున్నామని పేర్కొంది.

బ్రెగ్జిట్ వాణిజ్యానికి సంబంధించి ఏ ఒప్పందాన్నైనా బ్రిటన్ పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంటుంది. కానీ, బ్రిటన్ పార్లమెంట్ సభ్యులు శుక్రవారం నుంచి జనవరి 5 వరకు క్రిస్మస్ సెలవుల్లో ఉండనున్నారు. అయితే.. ఒకవేళ ఒప్పందం చివరిదశకు చేరుకుంటే 48 గంటల నోటీసుతో వారిని వెనక్కి రప్పిస్తామని ప్రభుత్వం చెబుతోంది.

ఒబామా పుస్తకం అమ్మకాలలో కొత్త రికార్డ్..!

ఎఫ్​డీఏ కోసం మోడెర్నా తిప్పలు..!

అమెరికా బిల్లు.. భారత్ లాభం..!..!

ఆ ఇద్దరి ప్రమాణస్వీకారం అత్యంత నిరబడారంగా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -