Friday, April 26, 2024
- Advertisement -

మోదీ vs బీఎస్​ఎఫ్ జవాన్ తీర్పు నేడే..!

- Advertisement -

బీఎస్​ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్ ఎన్నికల నామినేషన్ తిరస్కరణ కేసులో సుప్రీం కోర్టు మంగళవారం తుది తీర్పు ఇవ్వనుంది. జస్టిస్ ఎస్​.ఏ. బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం నవంబర్ 18న బహదూర్ పిటిషన్​పై తీర్పు రిజర్వు చేసింది.

2019 ఎన్నికల్లో తేజ్ బహదూర్​ ప్రధాని నరేంద్ర మోదీకి పోటీగా వారణాసిలో పోటీకి నామినేషన్ వేశారు. సమాజ్​వాదీ పార్టీ(ఎస్పీ) అభ్యర్థిగా తేజ్​ బహదూర్​ నామపత్రం సమర్పించారు. ఉద్యోగ కాలంలో ఎలాంటి రాజద్రోహం, అవినీతికి పాల్పడలేదన్న ధ్రువపత్రాన్ని సమర్పించాలని బహదూర్​ను కోరింది ఎన్నికల సంఘం. గడువులోగా సర్టిఫికేట్ సమర్పించనందున ఆయన నామినేషన్​ను 2019 మే 1న తిరస్కరించారు రిటర్నింగ్​ అధికారి. అధికారుల నిర్ణయాన్ని సవాలు చేస్తూ అలహాబాద్​ హై కోర్టును ఆశ్రయించారు బహదూర్​. అక్కడ ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వెలువడింది. దీనితో సుప్రీంను ఆశ్రయించారు బహదూర్. ఇరు పక్షాల వాదనను విన్న సుప్రీం కోర్టు మంగళవారం తీర్పు వెల్లడించనుంది.

సొంత విమనాలు ఉన్న టాలీవుడ్ స్టార్స్..!

ఈ టాప్ విలన్‍ల రెమ్యునరేషన్ ఎంతంటే..?

హిట్ సినిమాలను జస్ట్ మిస్ చేసుకున్నా హీరోయిన్లు..!

లేడీ గెటప్ లో కనిపించిన టాలీవుడ్ హీరోలు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -