Saturday, April 20, 2024
- Advertisement -

చిరంజీవి అప్పుడు నిద్ర పోయారా ?

- Advertisement -

కేంద్ర మాజీ కాంగ్రెస్ మంత్రులు చిరంజీవి – దాసరి నారయణ రావు లు ముద్రగడ పద్మనాభం విషయం లో కలిసిపోయారు. మొన్నటి వరకూ ఇండస్ట్రీ గొడవల పట్ల ఏడ మొహం పెడ మొహం పెట్టుకున్న ఈ పెద్ద మనుషులు ఇద్దరూ కాపు గొడవ అనగానే హడావిడి చేసారు.

ఆయన ఆరోగ్యానికి ఏమైనా అయితే ఒప్పుకోము గాక ఒప్పుకోము అంటూ మీడియా కి ఎక్కారు . అయితే ఇన్నాళ్ళూ సైలెంట్ గా ఉన్న వారిద్దరూ సడన్ గా స్క్రీన్ మీదకి రావడం వెనక చాలా కారణాలు ఉన్నాయి అని అంటున్నారు. ముద్రగడ కి కాపులలో ఇప్పటికే మంచి పేరు వచ్చేసింది, కాపు నాయకుడిగా ఆయన ఇప్పుడు అందరి నోళ్ళలో నానుతున్నారు. కాపులకి హెడ్ గా ఆయన గనక పేరు తెచ్చుకుంటే తమ పరిస్థితి ఏంటి అనేది భయపడుతూ వారిద్దరూ ముందుకు వచ్చారు అని బుద్దా వెంకన్న మీడియా తో అన్నారు. ముద్రగడ కి మైలేజీ రాకూడదు అనే ఉద్దేశ్యం తో దాసరి – చిరంజీవి కలిసి బొత్స లాంటి వారితో కలిసి రాయబారులుగా మారారు అని ధ్వజమెత్తారు ఆయన.

కేంద్రం లో రాష్ట్రం లో కాంగ్రెస్ అధికారం సాగినప్పుడు చిరంజీవి. దాసరి , బొత్స లు నిద్ర పోతున్నారా  ? అని ఆయన ఎద్దేవా చేసారు. రాజకీయ లభ్ది కోసం చంద్రబాబు న్ని  టార్గెట్ చెయ్యడం మూర్ఖత్వం అవుతుంది అని వెంకన్న అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -