Saturday, May 18, 2024
- Advertisement -

సల్మాన్ పై అతి ప్రేమతో వాళ్లు కేసుల్లో ఇరుక్కుపోయారు!

- Advertisement -

హిట్  అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్ కు కొంత ఊరట లభించింది కానీ.. ఆయనపై అపారమైన ప్రేమను కనబరిచిన కొందరు మాత్రం ఇబ్బందుల్లో పడిపోయారు. కింది కోర్టు విధించిన శిక్షను సస్పెన్షన్ లో ఉంచుతూ.. పై కోర్టు సల్మాన్ కు ఊరటనిచ్చింది. ప్రస్తుతానికి అయితే ఈ బాలీవుడ్ సూపర్ స్టార్ ప్రశాంతంగా గడపడానికి అవకాశం లభించింది.

పై కోర్టులో విచారణ జరగడం.. అక్కడ కూడా సల్మాన్ న్యాయవాదులు తమ వాదనలు వినిపించడం నెక్ట్స్ జరగాల్సి ఉంది. ఈ ప్రక్రియ అంతా చాలా కాలం పాటు కొనసాగితే.. సల్మాన్ అంతవరకూ ప్రశాంతంగా గడిపేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఆయన సంగతి అలా ఉంటే.. సల్మాన్ కు కింది కోర్టు శిక్ష విధించినప్పుడు అతిగా రియాక్ట్ అయిన సల్మాన్ సన్నిహితులపై కేసులు నమోదయ్యాయి.

హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ కు శిక్ష పడే సరికే… బాలీవుడ్ సింగర్ అభిజిత్ భట్టాచార్య, డిజైనర్ ఫరాలు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. సల్మాన్ ది ఎటువంటి తప్పులేదన్న వాదనలతో వీరు ఫుట్ పాత్ లపై నిద్రించే వారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రమాదం చేసిన సల్మాన్ ది కాదు తప్పు.. ఫుట్ పాత్ లపై పడుకొన్న వారిది అంటూ రెచ్చిపోయారు. దీనిపై వీరు తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు.

ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేసిన వారిపై కేసు నమోదు చేయాలంటే నమోదైన పిటిషన్ ను బిహార్ లోని ముజఫర్ నగర్ కోర్టు విచారణకు స్వీకరించింది. వారిపై కేసు నమోదు చేయాలనికోర్టు ఆదేశించింది. అయితే తాము ఎవరినీ కించపరచడానికి ఈ వ్యాఖ్యానాలను చేయలేదని ఫరా చెప్పుకొచ్చింది. అయితే చేసింది అతి కాబట్టి.. వీళ్లు అందుకు తగిన శిక్షను అనుభవించాల్సిందే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -