- Advertisement -
మొన్నటి వరకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజీగా గడుపుతూ.. ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చిన తీన్మార్ మల్లన.. అలియాస్ చింతపండు నవీన్ కుమార్పై చిలకలగూడ ఠాణాలో కేసు నమోదైంది. సీతాఫల్మండి డివిజన్ మధురానగర్కాలనీలో మారుతి సేవా సమితి పేరిట లక్ష్మీకాంతశర్మ జ్యోతిషాలయం నిర్వహిస్తున్నాడు.
వారం క్రితం తనకు ఫోన్ చేసిన తీన్మార్ మల్లన్న, రూ. 30 లక్షలు తక్షణం ఇవ్వాలని డిమాండ్ చేశారని, తాను ఇవ్వకపోవడంతో మరుసటి రోజు నుంచి తన చానెల్ లో అవాస్తవ కథనాలను ప్రసారం చేశారని లక్ష్మీకాంత శర్మ చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఈ కేసుపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నట్లు చిలకలగూడ సీఐ నరేష్ తెలిపారు. కాగా, తీన్మార్ మల్లన్న క్యూ టీవీ నిర్వాహకుడిగా కొనసాగుతున్నారు.
దారుణం.. బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన అఘంతకులు!