Saturday, May 11, 2024
- Advertisement -

పిటిష‌న్‌పై విచార‌ణ‌ను ఈ నెల 20కి వాయిదా

- Advertisement -

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి త‌ల‌పెట్టిన పాద‌యాత్రకు సంబంధించి సీబీఐ కోర్టు అనుమ‌తిపై స‌స్పెన్స్ కొన‌సాగుతోంది. ప్ర‌జాస‌మ‌స్య‌ల‌ను తెలుసుకోడానికి పాద‌యాత్ర చేస్తున్నాని అందుకు మిన‌హాయింపు ఇవ్వాల‌ని జ‌గ‌న్ సీబీఐకోర్టులో పిటిష‌న్ వేసిన సంగ‌తి తెలిసిందే. అయితె పాద‌యాత్ర అనుమ‌తిపై ఉత్కంఠ కొన‌సాగుతోంది.

ప్రతి శుక్ర‌వారం లాగే అక్ర‌మాస్తుల కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ఈ రోజు సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకునేందుకు జ‌గ‌న్ వ‌చ్చేనెల 2 నుంచి పాదయాత్రకు సిద్ధమవుతున్న నేప‌థ్యంలో వేసిన ‘అక్రమాస్తుల కేసుల విచారణకు వ్యక్తిగతంగా హాజరు నుంచి మినహాయింపు’ పిటిష‌న్‌పై సీబీఐ కోర్టు విచారణ జరిపింది. పిటిష‌న్‌పై విచార‌ణ‌ను ఈ నెల 20కి వాయిదా వేస్తున్న‌ట్లు సీబీఐ కోర్టు ప్ర‌క‌టించింది.

జ‌గ‌న్‌కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వకూడ‌ద‌ని సీబీఐ ఈ రోజు ఉద‌యం కౌంట‌ర్‌ దాఖలు చేసిన విష‌యం తెలిసిందే. జగన్ తాను పాదయాత్ర తలపెట్టిన నేపథ్యంలో నవంబర్ 2 నుంచి ఆరు నెలల పాటు తన వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వాలని ఇటీవల కోరారు. జ‌గ‌న్ చేప‌డుతున్న పాద‌యాత్ర‌కు అనుమ‌తి వ‌స్తుందా లేదా అన్న‌తి మ‌రో వారం రోజులు ఆగాల్సిందె.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -