Saturday, May 18, 2024
- Advertisement -

తెలంగాణ నాయకులకు ఉన్న ప్రేమ.. మీకు లేదా బాబు

- Advertisement -
Central Government Shock to Chandrababu on polavaram project

ఏపీ జీవ‌నాడి పోల‌వ‌రం ప్రాజెక్టు కంచికి చేరిన‌ట్లే క‌నిపిస్తోంది. ఇన్నాళ్లు  కేంద్ర‌మే ప్రాజెక్టును పూర్తి చేస్తార‌ని ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టిన  సీఎం చంద్ర‌బాబునాయుడు బ్యాచ్ కు ఇప్పుడ కేంద్రం దిమ్మ‌తిరిగే శాఖ్ ఇచ్చింది. పోలవరం పెరిగిన అంచనాలతో మాకు సంబంధం లేదు.

2014 నాటికి పోలవరం అంచనా వ్యయం ఎంత ఉందో.. అది మాత్రమే కేంద్రం భరిస్తుంది, పెరిగిన అంచనా వ్యయాలకూ, కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదు అని ఉమాభారతి కుండబద్దలు కొట్టారు. దీంతో బాబుటీంకు దిమ్మ‌తిరిగి బొమ్మ‌క‌నిపించింది. ఇన్ని రోజులూ కేంద్రంమీదే గంపెడాశ‌లు పెట్టుకున్న బాబు ఆశ‌లు అడియాశ‌ల‌య్యాయి. ఇప్పుడు దీంతో రాష్ట్రంలోని ప్ర‌తిప‌క్షాల‌కు ఏం స‌మాధానాలు చెప్తారో బాబు టీం  మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు.

పార్ల‌మెంట్ లో  2014 నాటికి అంచానావేసిన వ్య‌యాన్ని మాత్ర‌మే భ‌రిస్తామ‌ని ప్ర‌క‌టించిన ప‌క్షంలో టీడీపీ ఎంపీలు ఎవ్వ‌రూ నోరుమెద‌ప‌కుండా సైలెంట్ అయ్యారు.సీనియ‌ర్ మంత్రి అయిన ఆశోక్ గ‌జ‌ప‌తి రాజుకూడా క‌నీసం ఒక్క మాట కూడా మాట్లాడ‌లేక‌పోవ‌డం అంద‌ర్నీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ప‌క్క రాష్ట్రం తెలంగాణా ఎంపీలు పోల‌వ‌రం ప్రాజెక్టుతో  ఏసంభంధం లేకున్నా ప్రాజెక్టు వ్య‌యాన్ని కేంద్ర‌మే భ‌రించాల‌నీ పార్ల‌మెంట్ స‌మావేశాల్లో ఎంపీ క‌విత‌,జితేంద‌ర్‌రెడ్డిలాంటి వారు డిమాండ్ చేశారు….. కానీ మ‌న తెలుగు దేశం ఎంపీలు మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడ‌క‌పోవ‌డం చూస్తే తెలంగాణా నాయ‌కుల‌కు ఉన్న ప్రేయ‌….మ‌న నాయ‌కుల‌కు లేదా అనే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. దీన్ని బ‌ట్టే అర్థం చేసుకోచ్చు ఏపీ జీవ‌నాడి పోల‌వ‌ర మీద ఎంత‌ప్రేమ ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

Also Read

  1. జగన్ కు, చంద్రబాబుకు తేడా అదేనట
  2. ఏపీ, తెలంగాణాలో నియేజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న సురూ
  3. చంద్రబాబుకు షాక్.. వైసీపీలోకి తెలుగు తమ్ముళ్ళు
  4. చంద్రబాబు కు వణుకు పుట్టిస్తున్న ఎన్టీఆర్ జాతకం

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -