రాష్ట్ర విభజన తర్వాత ఆంద్రప్రదేశ్ అంధకారంలోకి వెల్లందన్నది వాస్తవం.కట్టుబట్టలతో విడిపోవాల్సి వచ్చింది.ఏపీని తిరిగి అభివృద్ది పథంలో నడిపించాలంటె అనుభవం కలిగిని నాయకుడు అవసరం.ఎందు కంటె ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి అంతా హైదరాబాద్ నగరానికే పరిమిత మవడంతో ఏపీలో కనీసం చెప్పుకోదగ్గ స్థాయిలో ఎక్కడా అభివృద్ది లేదు.ఒక విధంగా చెప్పాలంటె అనాధ రాష్ట్రంగా మారిందని చెప్పవచ్చు.
2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ను ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దాలంటె అందుకు సమర్థుడు పదిసంవత్సరాలు సీఎంగా …రెండు పర్యాయాలు ప్రతిక్షనేతగా ఉన్న చంద్రబాబే సరైన వ్యక్తిని ప్రజలు చంద్రబాబుకి పట్టం గట్టారు.దీంతో అధికార పీఠంపై కూర్చున్నారు.ఇక చేయాల్సింది రాజధాని అభివృద్దితోపాటు ఏపీ అభివృద్దిమీద దృష్టి సారించాలి.కాని మన సీఎం చేసింది ఏమిటి అనుకుంటే …అమరావతిలో తాత్కాలిక సచివాలయం,అసెంబ్లీ, పట్టిసీమ నీటి ప్రాజెక్టు తప్ప చేసింది ఏమీలేదు.వీటికి తోడు ఈమూడు సంవత్సరాలలో రాష్ట్రంలో ఇసుకమాపియా,భూకుంభకోనాలు విచ్చలవిడిగా పెరిగాయి.
{loadmodule mod_custom,GA1}
రాష్ట్రం త్వరగా అభివృద్ది చెందాలంటె కేంద్రం సహాయం అవసరం అని గత ఎన్నికల్లో భాజాపాతో పొత్తుపెట్టుకున్నారు.ఇటు రాష్ట్రంలో టీడీపీ కేంద్రంలో భాజాపా అధికారంలోకి వచ్చాయి.కాని ఇప్పటి వరకు చేసింది అనుకుంటె నోటి మాటలు తప్ప ఎక్కడా అభివృద్దిఅనేది కనపడలేదు.లక్షల కోట్లు ఇచ్చామని కేంద్రం చెప్తున్నా అనిధులన్నీ ఎక్కడకు వెల్తున్నాయో అర్థం కావడంలేదు.
రాష్ట్రానికి పెట్టుబడులపేరుతో విచ్చలవిడిగా ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి విదేశీ పర్యటనలు చస్తున్నారు తప్ప ఆశించిన పెట్టు బడులు రాలేదు.పైగా పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయిని ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించిడం తప్ప చేతల్లో చేసింది శూన్యం.విశాఖలో పరిశ్రమలు సమ్మిట్ను ఏర్పాటు చేసి లక్షలకోట్ల పెట్టుబడులు వస్తున్నాయని ఎమ్ఓయులు కుదుర్చుకోవడం తప్ప ఒక్క ఉద్యోగం…ఒక్క కంపెనీ రాలేదు.
ఈమూడు సంవత్సరాలలో అభివృద్ది చేయకుండా మాటలతో కాలం గడిపిని బాబు ఇప్పుడు మేల్కొన్నారు.దీక్ష పేరుతో రివ్యూలు.. ప్రతిన చేయటం లాంటివి ఎన్ని చేసినా.. మనసులో కమిట్ మెంట్ లేనంత కాలం ఎలాంటి ఉపయోగం ఉండదన్న విషయాన్ని బాబు మర్చిపోకూడదు. ఇదిలాఉంటే.. జూన్ 2ను నవనిర్మాణ దీక్షగా ఆంధ్రోళ్లు ఎంత మాత్రం అంగీకరించే స్థితిలో లేదన్నది మర్చిపోకూడదు.ఇప్పుడు నవనిర్మాన దీక్షలు ఏంలాభం.
{loadmodule mod_custom,GA2}
గడిచిన మూడేళ్ల పాలనలో ఆంధ్రోళ్ల బతుకుల్ని అంతగా ఏం మార్చారో ఒక్కమాటలో ఆయన చెబితే సరిపోదా? అందుకోసం ఇన్నేసి రోజులు దీక్షల పేరుతో కార్యక్రమాలు చేయటం ఏమిటో. ఒకవేళ చేసినా.. దాని వల్ల ప్రయోజనం జరిగితే ఫర్లేదు. కానీ.. ప్రచారం కోసమే తప్పించి ఎలాంటి ప్రయోజనం లేని కార్యక్రమాన్ని భుజాన వేసుకొని ప్రచారం చేస్తున్నది ఎందుకు? ఏపీ పట్ల తనకున్న కమిట్ మెంట్ ను ప్రదర్శించుకోవటానికా? అన్న సందేహం రాక మానదు.ఇప్పటి వరకు బాబు ఎంత అభివృద్ది సాధించాడో ఆయనకే తెలియాలి.
{loadmodule mod_sp_social,Follow Us}
Related