Saturday, May 18, 2024
- Advertisement -

అదే జరిగితే… చంద్రబాబు కథ క్లోజ్..?!

- Advertisement -

తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డి అప్రూవర్ గా మారితే..? ఓటుకు నోటు వ్యవహారంలో ఆయన ఏసీబీ దగ్గర అసలు కథను అంతా వివరిస్తే.. ఈ వ్యవహారం గుట్టును ఏసీబీ అధికారులు రాబడితే..?

తెలుగు రాజకీయాల్లో అదో సంచలనం అవుతుంది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారతుంది. వీటన్నింతిటో పాటు.. తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు అదో తీవ్రమైన ప్రమాదంగా మారే అవకాశం ఉంది!

ఏసీబీ కి పక్కా ప్రూఫులతో దొరికిపోయాడు రేవంత్ రెడ్డి.  ఎమ్మెల్యేను కొనుగోలు చేయడానికి ఆయన ప్రయత్నించాడు. నోట్ల కట్టలను కూడా బల్లపై పరిచి చూపించాడు. తన కథా.. కమామీషు అంతా వివరించాడు! అయితే ప్రస్తుతానికి ఆయన బుకాయిస్తున్నాడు. తను ఎమ్మెల్యేను కొనుగోలు చేయడానికి అక్కడికి వెళ్లలేదని స్పష్టం చేస్తున్నాడు. ఇదంతా కుట్ర అని ఆయన వ్యాఖ్యానిస్తున్నాడు. 

అయితే ఏసీబీ ఈ విషయాన్ని అంత ఈజీగా విడిచిపెట్టకపోవచ్చు. ఒకవేళ కేసీఆర్ ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొంటే వ్యవహారం చాలా రంజుగా మారుతుంది. ఈ కేసులో విచారణ జరిగిందంటే.. రేవంత్ ను ఏ1 గా చేర్చాల్సి ఉంటుంది.. ఆయన నోటి వెంట వచ్చిన “బాస్” పేరును ఏ2గా చేర్చవాల్సి ఉంటుంది. ఆ బాస్ గనుక చంద్రబాబే అని రుజువు అయితే.. బాబు రాజకీయ జీవితానికి ఇదొక మచ్చగా మిగులుతుంది. రాజకీయ అవినీతి లో భాగస్వామిఅయినందున బాబు పొలిటికల్ లైఫ్ కు కూడా ఇబ్బందులు కలగవచ్చు. ఆధారాలు గట్టిగా ఉన్నాయి కాబట్టి.. ఏం జరిగినా.. బాబు పదవిని కోల్పోయినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో!

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -