ప్రస్తుతం అందరికీ థర్డ్వేవ్ భయం పట్టుకున్నది. మొదటి వేవ్లో వృద్ధులు, రెండో వేవ్లో మధ్య వయసు వాళ్లు, యువకులకు కరోనా సోకింది కాబట్టి.. మూడో వేవ్లో కచ్చితంగా చిన్నపిల్లలపైనే ప్రభావం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో చిన్న పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. చిన్నపిల్లలకు వ్యాక్సిన్ కూడా అందుబాటులో లేదు. ఇప్పటికే పిల్లలకు సంబంధించిన కరోనా వ్యాక్సిన్ల కోసం ప్రయోగాలు జరుగుతున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం చిన్నపిల్లలకు సంబంధించిన వ్యాక్సిన్లు ప్రయోగ దశలో ఉన్నాయి. ఈ వ్యాక్సిన్లు సత్ఫలితాలు ఇచ్చినట్టు సమాచారం. ఈ మేరకు సైన్స్ ఇమ్యూనాలజీ పత్రికలో ఓ కథనం ప్రచురితం అయ్యింది. మోడెర్నా టీకా పిల్లలపై సత్ఫలితాలు ఇచ్చిందని ఈ కథనంలో పేర్కొన్నారు. మోడెర్నా టీకా పిల్లల మీద ప్రయోగించగా.. వారిలో యాంటీబాడీలు అభివృద్ధి చెందాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఆఫ్రికా జాతికి చెందిన 16 కోతి పిల్లలపై 22 వారాలపాటు ప్రయోగం చేయగా.. ఈ వ్యాక్సిన్ సత్ఫలితాలు ఇచ్చిందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. జంతువులకు ప్రీక్లినికల్ మోడెర్నా, ఎంఆర్ఎన్ఏ టీకా అమెరికాకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ (ఎన్ఐఏఐడీ) అభివృద్ధి చేసిన ప్రోటీన్ ఆధారిత వ్యాక్సిన్ ఇచ్చారు. అయితే దీనిపై మరింత ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
Also Read : థర్డ్వేవ్.. చిన్నపిల్లల తల్లిదండ్రులూ బీకేర్ఫుల్..!
మనదేశంలో ఇప్పటికే థర్డ్వేవ్ పై ఆందోళనలు నెలకొన్నాయి. మహారాష్ట్ర లో అక్కడక్కడా చిన్నపిల్లలకు కరోనా వచ్చినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆందోళన నెలకొన్నది. ప్రస్తుతం మనదేశంలో అందుబాటులో ఉన్న కోవాగ్జిన్, కోవిషీల్డ్ పంపిణీ కూడా సక్రమంగా పంపిణీ చేయడం లేదు. చాలా మంది కోవిషీల్డ్ మొదటి డోస్ తీసుకొని రెండో డోస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో చిన్నపిల్లలకు వ్యాక్సిన్ సక్సెస్ అయినా.. అది మనదేశంలో అందుబాటులోకి వచ్చి.. వ్యాక్సినేషన్ చేసే సరికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది.
Also Read: సీక్వెల్.. ఇప్పుడిదే సక్సెస్ ఫార్ములా?