మెగాస్టార్ చిరంజీవికి తెలుగు ఇండస్ట్రీ లో ఒక ప్రత్యేకత ఉంది. సొంత కాళ్ళపైన నిలబడి తనకంటూ ఇండస్ట్రీ లో ఒక బ్రాండ్ ని సృష్టించుకున్నాడు. చిరంజీవికి కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. చిన్న కూతురు అయితే ప్రేమించి ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా పెళ్లి చేసుకొని ఒక పాపకి కూడా జన్మనించింది.
ఇక ఆతర్వాత శ్రిజకి తన భర్తకి గొడవలు రావడం తరువాత కలుగజేసుకున్న మెగా కుటుంబం ఆ వ్యక్తి నుంచి శ్రీజను తీసుకొచ్చి ఓ వ్యాపార వేత్తతో పెళ్లి జరిపిన విషయం తెలిసిందే. తాజాగా చిరంజీవికి కోర్టునుంచి నోటీసులు రావడంతో మెగా ఫ్యామిలీ మొత్తం షాక్ అయ్యారు. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ విషయంలో మెగా కుటుంబానికి కోర్టు నోటీసులు పంపింది.
అయితే శ్రీజకు పుట్టిన పాప విషయంలో మొదటి భర్త కోర్టు ఆశ్రయించి చిరంజీవికి నోటీసుల పంపించారు. పాప తనకు కావాలని, పాపను నేను పెంచుకుంటానంటూ శ్రీజ మొదటి భర్త మెగా కుటుంబానికి నోటీసులు పంపడం గమనార్హం. అయితే ఇప్పటి వరకు మెగా కుంటుంబం నోటీసులపైన స్పందించలేదు.