Friday, May 3, 2024
- Advertisement -

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీప‌క్ మిశ్రాకు గడ్డుకాలం…

- Advertisement -

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా గ‌డ్డు ప‌రిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇటీవలి కాలంలో అత్యంత వివాదాస్పదమైన వ్యక్తుల్లో ఒకరిగా నిలిచారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా. ఆయన చర్యలను వ్యతిరేకిస్తూ ఏకంగా సుప్రీంకోర్టు జడ్జిలే ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి, కలకలం రేపిన సంగతి తెలిసిందే.

ఆయనపై పార్లమెంటులో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తును ప్రారంభించింది. ఇప్పటికే వివిధ పార్టీలకు చెందిన ఎంపీల నుంచి సంతకాలను కాంగ్రెస్ సేకరిస్తోందని ఎన్సీపీ నేతలు వెల్లడించారు. అయితే, ఈ అంశంపై కాంగ్రెస్ ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు.

భారతదేశ ప్రధాన న్యాయమూర్తి అభిశంసన కోసం కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలు పెట్టిందని ఎన్సీపీ ఎంపీ మెమన్ తెలిపారు. తాను కూడా ఇప్పటికే సంతకం చేశానని… ఇంకా ఎంత మంది సంతకాలు చేశారో కాంగ్రెస్ నే అడగాలని సూచించారు. సంతకాల సేకరణ ప్రక్రియ కొనసాగుతోందని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు సంతకాలు చేసిన వారిలో కాంగ్రెస్, ఎన్సీపీ, సీపీఎం, సీపీఐలతో పాటు ఇతర పార్టీల ఎంపీలు కూడా ఉన్నారని చెప్పారు.

మరోవైపు, సుప్రీకోర్టు చీఫ్ జస్టిస్ పై పార్లమెంటులో అభిశంసన తీర్మానం పెట్టాలంటే… లోక్ సభలో 100 మంది ఎంపీలు, రాజ్యసభలో 50 మంది ఎంపీల సంతకాలు అవసరమవుతాయి. కాంగ్రెస్ అగ్రనేత గులాం నబీ అజాద్ ఈ విషయమై ఇతర పార్టీల నేతలతో సమావేశమై, చర్చలు జరుపుతున్నారు. అయితే దీనిపై స్పందించేందుకు కాంగ్రెస్‌ పార్టీ నేతలు నిరాకరించారు. పార్లమెంటులో అభిశంసన తీర్మానం నెగ్గితే, దీపక్ మిశ్రా చీఫ్ జస్టిస్ ఉద్యోగాన్ని కోల్పోతారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -