వైఎస్ రాజశేఖరరెడ్డి 10వ వర్ధంతి …నివాలులు అర్పించి తండ్రిని గుర్తుకు చేసుకున్న సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇవాళ కడప జిల్లాకు వెళ్లారు. ఇడుపులపాయలో జరిగే తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 10వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.ముఖ్యమంత్రి జగన్, వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, వైఎస్ షర్మిల వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. వారితో పాటు వైఎస్సార్సీపీ నాయకులు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్డ్డి, వైఎస్సార్ అభిమానులు నివాళులర్పించారు.
ఇడుపులపాయ నుంచి బయల్దేరిన అనంతరం ముఖ్యమంత్రి జగన్ భాకరాపురం చేరుకుని వైఎస్ వివేకానందరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు. సొంత నియోజకవర్గం పులివెందుల అభివృద్ధిపై మధ్యాహ్నం 12 గంటలకు సీఎం సమీక్ష నిర్వహిస్తారు.